స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Thursday 23 August 2018

కథ మినార్ ఆవిష్కరణ

కథ మినార్ ఆవిష్కరణ 

కొన్ని జ్ఞాపకాలు అంతే 
ఆగకుండా ముంచెత్తుతూనే ఉంటాయి 
బహుశా వేసిన కొత్త దారి చూసుకొమ్మని కాబోలు !!



ఖదీర్ బాబు గారి మాటల్లోనే ..... 


రచయితలకు నమస్కరించుకుని....
వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ గార్ల ‘కథ’ పుస్తకాల ఆవిష్కరణ రోజంతా జరుగుతుంది. ఉదయం చాలామంది ఆవిష్కరణ సమయంలో ఉంటారు. భోజన విరామం తర్వాత సహజంగానే చాలామంది తగ్గుతారు. ఆ సమయంలో ఆ సంకలనంలోని రచయితలకు ‘కాంప్లిమెంటరీ కాపీ’ ఇస్తుంటారు. అందరూ ఉండగా ఇస్తే వాళ్లకు గౌరవం కదా అంటాను నేను. నా ‘ఖాదర్ లేడు’ కథను మధురాంతకం నరేంద్ర, రాసాని గార్లు ‘కథా వార్షిక’లో అచ్చు వేసి హైదరాబాద్‌లో ఆవిష్కరణ పెట్టారు. వేదిక మీద పిలిచి కాపీ ఇస్తారనుకొని వెళ్లాను. సభ ముగించుకుని వెళ్లిపోయారు. రెండు రోజుల పాటు తిరుపతికి ఫోన్లు చేసి మరీ వారితో పేచీ పడ్డాను. 25 ఏళ్ల కథాసాహితి బృహత్ సంకలనం వేసినప్పుడు తెలుగు యూనివర్సిటీకి వెళితే హాలు బయట ఐడి కార్డు చూపి కాంప్లిమెంటరీ కాపీ తీసుకోమనే అర్థంలో మాట్లాడారు. ఇది రచయితలకు అవమానం అని వేదిక మీద తగాదా పడ్డాను.
సంకలనాలు వచ్చాయి అంటే అందుకు కారణం సంపాదకులు కాదు... ప్రచురణకర్తలు కాదు... రచయితలు. వారు రాస్తేనే సంకలనాలు వస్తాయి. కనుక ఆవిష్కరణ అయిన వెంటనే తొలి కాపీ అందుకోవాల్సింది వారు. మొదటి నమస్కారం స్వీకరించాల్సిందీ వారు. ‘నూరేళ్ల తెలుగు కథ’, ‘కొత్త కథ’, ‘ఉత్తమ తెలుగు వాన కథలు’ సభలలో ఈ గౌరవం పాటించాను. నా సూచన అందుకుని ‘ప్రాతినిధ్య’ ఆవిష్కరణలోనూ ఇదే గౌరవం పాటించారు.
‘కథా మినార్’ ఆవిష్కరణలో ఆవిష్కరణ అయిన వెంటనే రచయితలకు సగౌరవంగా కాపీలు అందించాం. వేదిక మీద ఉన్న పెద్దలనే కాదు సభలో ఉన్న సాహితీకారులనూ ఇందులో భాగం చేశాం.
ఈ పని చేసినందుకు షరీఫ్, నేను ఎంతో సంతోషించాం.
ఫొటోలు చూస్తే మీరూ సంతోషిస్తారు.
పి.ఎస్: ‘కథామినార్’ అక్షరాలు రాసిచ్చిన లక్ష్మణ్ ఏలేకు మలిప్రతి.

No comments:

Post a Comment