స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం
Showing posts with label అవార్డ్స్. Show all posts
Showing posts with label అవార్డ్స్. Show all posts

Wednesday, 14 November 2018

మళ్ళీ కథల సాయంత్రాలు ఒక తీపి కబురుతో

  జీవితం ఎప్పుడూ రెండు మైలురాళ్లు మధ్యే ఉంటుంది 
సూక్ష్మం గా చూస్తే చావు పుట్టుక 
స్థూలంగా చూస్తే 
చేసిన పని ,చేయాల్సిన బాధ్యత 
చేసిన పని అవార్డులుగా గుర్తింపు పొందితే 
చెయ్యాల్సిన పని దీపాన్ని పట్టుకోమంటుంది 
రెండు పట్టాల మీద బ్యాలెన్స్ గా వెళ్లగలిగినవాళ్లకే 
జీవితపు చప్పట్లు !!

పతంజలి గారి అవార్డు అందుకోబోతున్నందుకు 
ఖదీర్ బాబు గారికి అభినందనలు 
 
కథకుల కరచాలన వేళ మళ్ళీ వచ్చేసింది.
#writers' meet #kudali #yakshi 




Tuesday, 22 May 2018

కథా దీప ధారులు

కథా దీప ధారులు 
కొందరు ఉంటారు 
లోపలి దుఃఖం నిలవనీయక అక్షరాలుగా మారి 
విలవిలా ఏడుస్తూ ఉంటారు 
దారిగా తామే మారుతూ ఉంటారు 
మరి ఆ దీపాల్ని ఏమని పొగడాలి
ఖదీర్ గారి మాటల్లోనే చదవండి ....  


పురస్కార పత్రం ఎలా రాస్తారు?
ఎలా రాస్తారు? తెలియదు. కాని ‘రైటర్స్ మీట్’ తరఫున
 ‘కొత్తకథ 2018’ ఆవిష్కరణలో 
ముందు తరం రచయితలను ‘కథా దీపధారులు’ 
పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించుకున్నాక 
కొలకలూరి ఇనాక్, బి.ఎస్.రాములు, ఇంద్రగంటి జానకీబాల గార్ల
 గురించి ఇలా నాలుగు వాక్యాలు రాయగలగడం
 నాకు సంతోషం కలిగించింది. అంతేనా? 
వీరి ముగ్గురి గౌరవార్థం అడిటోరియం అంతా లేచి నిలబడి
 స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం... 
ఆ క్షణంలో ఎందరో కథకులు ఉండటం ఎంత భాగ్యమని.


కథా దీపధారి
2018
కొలకలూరి ఇనాక్
పావుకోళ్లు, స్పృశ్య పాదాలతో నిండి ఉన్న తెలుగు కథావరణంలో అస్పృశ్యమైన కిర్రుచెప్పులతో నడిచి వచ్చి, నడుము మీద చేతులు వేసి నిలుచుని, భుజాలు పొంగించగల ఒక అక్షరాన్ని తీసుకువచ్చిన కొలకలూరి ఇనాక్ 1954లో తన మొదటి కథ అచ్చయిన నాటి నుంచి 60 సుదీర్ఘ సంవత్సరాలుగా కథను అన్నవస్త్రాలుగా ధరించి తిరుగుతున్న కథామూర్తి. నల్ల అక్షరాన్ని, నలిపివేయబడ్డ అక్షరాన్ని, వెట్టి అక్షరాన్ని, వెలి అక్షరాన్ని, ఊరి చివరే ఉంచేసి ఊళ్లోకి రావద్దన్న అక్షరాన్ని కథను చేసి, కసిని చేసి, ఆధిపత్యపు మేకు నెత్తిన మోదగల గూటాన్ని చేసి, అహంకారమనే తోలును వలవగల కత్తిని చేసి పాఠకుల చేతికి అందించిన కథకుడు ఆయన. 300 కథలు, 11 కథా సంపుటాలు వీరి ఇరుభుజాల మీద సీతాకోక చిలుకల వలే వాలి ఉన్నాయి. కటికలు, ఎరుకలు, యానాదులు, ముస్లింలు, స్త్రీలు, పతితులు, భ్రష్టులు వీరి కథల్లో పాఠకులతో కలిసి ఏడ్చారు. నవ్వగలిగినప్పుడు నవ్వారు. కాని అంతకన్నా బాగా చేసిన పని పాఠకులను దగ్గరగా తీసుకొని హత్తుకోవడమే. ‘ఊరబావి’, ‘తల లేనోడు’, ‘రమ నా కూతురు’... ఇనాక్ కథా సంవిధానానికి, సంవాదానికి మచ్చు తునకలు. నాటకం, కవిత్వం, ఆధ్యాపకత్వం, ఉపన్యాసం... ఆయన సృజన సోపానాలపై నిలిచిన జీవభంజికలు. ‘పద్మశ్రీ’ పురస్కారం తెలుగు కథకు ఇనాక్ సాధించిన మేలిమి గౌరవం.
నిండైన రూపం, భేషజం లేని సంభాషణ, నిలువెత్తు స్ఫూర్తి... కొలకలూరి ఇనాక్ గారూ... మీవంటి వారు దారులు తొలిచి మార్గాలు వేయడం వల్లే మేము ఇవాళ నడుస్తున్నాం నడవగలుగుతున్నాం అని నమ్ముతూ కృతజ్ఞతగా ‘కథా దీపధారి’ పురస్కారంతో గౌరవించుకుంటున్నాం.
నమస్కారాలతో
రైటర్స్ మీట్

కథా దీపధారి 
2018
బి.ఎస్.రాములు
బీడీలు చుట్టాల్సిన చేతులు కథల్లోని వాక్యాలు రాస్తే ఏమవుతుందో అదే అయ్యింది. బాధితులు నాయకులు అయ్యారు. బాధపెట్టేవారు ప్రతినాయకులు అయ్యారు. ఇందుకు మేము ఇలా ఉన్నాం, ఇందుకు మేము దోపిడీకి గురవుతున్నాం, ఇందుకు మేము పరాయీకరణ చెందుతున్నాం, ఇందుకు మేము వృత్తులను కోల్పోతున్నాం, ఇందుకు మేము ప్రపంచ గమనంలో పావులమయ్యి చెల్లా చెదురవుతున్నాం అని చెప్పడానికి చెప్తూనే ఉండటానికి కథలు రాస్తున్న బి.ఎస్.రాములు 1980లో తన తొలి కథ రాసిన నాటి నుంచి నేటి వరకు 40 ఏళ్లుగా కథా పరిశ్రమ చేస్తూనే ఉన్నారు. 150కి పైగా కథలు, 12 కథాసంపుటాలు వీరి పేరున ఉన్న అల్మారాలో దీటుగా నిలుచుని ఉన్నాయి. విప్లవ పోరాటాలు, తెలంగాణ వలసలు, వెట్టి జీవితం, పై వర్గాల దౌర్జన్యం... వెరసి ఒక సామాజిక చరిత్రగా, మానవ సంబంధాల పరిణామానికి సాక్ష్యంగా వీరి కథలు పరిణమించాయి. ‘పాలు’, ‘అడవిలో వెన్నెల’, ‘బందీ’, ‘వారసత్వం’, ‘దక్షయజ్ఞం’... వంటి కథలు సామాజిక ఉద్దేశ్యం లేనిదే మంచి కథ కాలేదని నిరూపిస్తాయి. తాడోపేడో తేల్చుకోవడం కూడా కథకు ఉండాల్సిన ఒక లక్షణంగా నిరూపించిన రచయిత. కథల కోసం పరిశ్రమించారు. కొత్త రచయితల కోసం ‘కథల బడి’ గ్రంథాన్ని రచించారు. కథకుల పట్ల అనురక్తితో కథల వర్క్‌షాప్‌లు నిర్వహించారు. కథ పట్ల అవ్యాజమైన ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. వీరు బి.సి. కమిషన్‌కు చైర్మన్ కావడం కథకు లభించిన ఒక అలంకారం.
తెల్లటి నవ్వు, బోళా మనస్తత్వం, నిరంతర పథికత్వం... బి.ఎస్.రాములు గారూ మీవంటి వారు దారులు తొలిచి మార్గాలు వేయడం వల్లే మేము ఇవాళ నడుస్తున్నాం నడవగలుగుతున్నాం అని నమ్ముతూ కృతజ్ఞతగా ‘కథా దీపధారి’ పురస్కారంతో గౌరవించుకుంటున్నాం.
నమస్కారాలతో
రైటర్స్ మీట్
కథా దీపధారి
2018
ఇంద్రగంటి జానకీబాల
స్త్రీ కొంగుముడిలో చిక్కుబడి ఉన్న సమస్యలను విప్పి చెప్పడానికి నిబద్ధులైన ఇంద్రగంటి జానకీబాల తన మొదటి కథ 1970లో వెలువడిన నాటి నుంచి యాభై ఏళ్లుగా సుదీర్ఘ కథా ప్రస్తానం చేస్తూ పాఠకుల మేధో క్షుద్బాధకు గింజలను అందిస్తూనే ఉన్నారు. 200 కథలు, ఆరు కథాసంపుటాలు వీరి సృజనకు కథా ప్రయాణానికి ఆనవాలుగా ఉన్నాయి. ప్రోత్సాహం, ప్రతిస్పందన వంటివి తెలుగు సమాజంలో అతి సన్నని మిణుకు మిణుకుమనే దీపాలుకాగా తన వెలుతురు తానే వెతుక్కుంటూ కథను ధరించి నడిచిన రచయిత్రి. ‘జీవన రాజకీయం’, ‘వేణీ సంహారం’, ‘శత్రువు’... వంటి శక్తిమంతమైన కథలు జానకీబాల రచనా చేవకు నిదర్శనం. బాధ- కథను మొదలెట్టడానికి మొదటి సిరా చుక్క అని విశ్వసించే జానకీబాల వచనానికి పరిపూర్ణరూపం నవల ద్వారా వస్తుందని ‘కనిపించే గతం’ వంటి ప్రభావవంతమైన నవలతో నిరూపించారు. జీవనంలో పాటను తోడు చేసుకున్న ఈ రచయిత్రి అందుకు కృతజ్ఞతగా ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్స్ లైఫ్ స్కెచెస్‌తో ‘కొమ్మా కొమ్మా కోకిలమ్మా’ పుస్తకాన్ని అందించారు.
సెన్సాఫ్ హ్యూమర్, చలాకీతనం, హుందాతనం నిండిన సాహితీ జీవితం... ఇంద్రగంటి జానకీబాల గారూ మీవంటి వారు దారులు తొలిచి మార్గాలు వేయడం వల్లే మేము ఇవాళ నడుస్తున్నాం నడవగలుగుతున్నాం అని నమ్ముతూ కృతజ్ఞతగా ‘కథా దీపధారి’ పురస్కారంతో గౌరవించుకుంటున్నాం.
నమస్కారాలతో
రైటర్స్ మీట్

Sunday, 31 December 2017

2017 నాట్ ఎట్ కంప్లీటెడ్

2017 నాట్ ఎట్ కంప్లీటెడ్ 

అప్పుడే అయిపోయిందా 2017
దోసెడుతో దోసెడు 
నిండుగా అక్షర సన్మానాలు 
జరపకుండా ఎక్కడికి పోతుంది 
మెట్లన్నీ ఎక్కిన వారికి 
ఈ మెట్టు ఒక అడుగు అంతే 
ఇపుడు వాళ్ళు వెనుక వచ్చే వాళ్లకి 
దారి చూపే దీపం 
భుజం తట్టే చేయి 

అయినా కాలం ఊరుకుంటుందా !
మన తాయిలం వాటా మనకు ఇచ్చినా 
అమ్మ మళ్ళీ ఎప్పుడో చివరలో 
తన వాటా తాయిలం ఇచ్చి 
మన కళ్ళలో తనను చూసి మురిసినట్లు 
కాలం కూడా దాచి ఇస్తూ ఉంటుంది 
ఇలా కొన్ని అనందాలు మూటగట్టి 

పెద్దిబొట్ల అవార్డు అందుకున్నందుకు 
ఖదీర్ గారికి అభినందనలు 


 వారందరిలో చిన్నవాడు!
రెండువేల పన్నెండులో, తన డెబ్భైఐదవ జన్మదినోత్సవానికి వేదిక మీదకి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మన తెలుగు చిత్రకారుడు, పద్మశ్రీ ఎస్ వి రామారావు గారిని ఆహ్వానించే అరుదైన అవకాశాన్నినాకు కల్పించినవారు నవలాకారులు, అంతకంటే గొప్ప కధకులు#పెద్దిభొట్ల_సుబ్బరామయ్య గారు. తన అభిమాన రచయిత మధురాంతకం రాజారాం తనయుడు మధురాంతకం నరేంద్రకి « పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారం » ప్రదానం చేసి ఒక గొప్ప సంప్రదాయానికి అంకురార్పణ చేసిన రచయిత#పెద్దిభొట్ల.

తొలి "పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారం" అందుకున్నవారు Madhuranthakam Narendra. పురస్కార ప్రదాత, గ్రహీతలిద్దరూ అధ్యాపకులే ! ఆ నాటి ఆ సభకు అధ్యక్షత వహించింది పర్యావరణ ప్రేమికుడు, రచయిత పతంజలి శాస్త్రి గారు.

మళ్ళీ ఈ 2017 లో పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి పేరు మీదగా నెలకొల్పిన "పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారం" అందుకుంటున్న వాడు "ఖధీరుడు" . 

ఇంకొన్ని జ్ఞాపకాలు 














ముంబైలో సుధాకర్ ఉణుదుర్తి ఫ్లయిట్ ఎక్కారు. చెన్నైలో మురారి గారి ఫ్లయిట్ టేకాఫ్ అయ్యింది. కావలిలో కృష్ణజ్యోతి సింహపురి క్యాచ్ చేశారు. భూతం ముత్యాలు నల్గొండ బస్‌లో టికెట్ కొట్టించారు. అల్లం రాజయ్య మంచిర్యాలలో బ్యాగ్ తగిలించుకున్నారు. అన్వర్ వరంగల్ నుంచి సీదా రస్తా పట్టారు. కుమార్ కూనపరాజు రొయ్యల చెరువుల్ని వదిలిపెట్టి ప.గో నుంచి ఎకో స్పోర్ట్‌ని పరుగు పెట్టించారు. సిటీలో ఉన్న సాథీలంతా ఓలా క్యాబ్ కోసం వేళ్లు కదిలించారు. అందరి సూట్‌కేసులూ హైదరాబాద్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చేరాయి. నిద్ర ఎవరికి కావాలి? పుల్కాలు పెరుగున్నం ఎవరికి కావాలి? వెచ్చగా ఉన్న ఆ రాత్రి నలుపు ఎవరికి కావాలి? రచయితలతో మాటలు కావాలి. ఒక హాయ్ గురూ పలకరింపు కావాలి. నవ్వు నవ్వుగా భుజం చరుపు కావాలి. అరే మీరా అన్న ఆశ్చర్యం. పక్కపక్కన తనలాంటి వాళ్లతో కలిసి నిలబడటంలో ఆనందం. తుదకు తన కుదురును చేరిన నిమ్మళం.
అంబేద్కర్ స్మరణకు నీలం. దళిత సాహిత్యపు చేతనకు నీలం. అక్షరానికి ధాతువైన సిరాకు కృతజ్ఞతగా నీలం. కథను విస్తారం చేయడానికి నీలం. విశ్వంబరను చేయడానికి నీలం.

Thursday, 25 February 2016

ఇంకొన్ని జ్ఞాపకాలు

ఇంకొన్ని జ్ఞాపకాలు
మాడభూషి రంగాచార్య కధా పురస్కారం 2015
బియాండ్ కాఫీ కదా సంకలనానికి
ఈ రోజు అందుకున్న ఖదీర్ గారికి అభినందనలు










Thursday, 11 February 2016

పాటల హేల ఘంటసాల


పాటల హేల ఘంటసాల ఆపాత మధురాలు 
ఖదీర్ గారి కలం నుండి ..... 
పాటలు మధురం గానం మధురం 
వర్ణించిన అక్షరాలు దాగిన భావం 
మధురాతి మధురం 






khadeer gari interview by ananth link

అజో విభో అవార్డ్ విశేషాలు



Tuesday, 2 February 2016

కొత్త ఏడాది కురిసే అవార్డుల వర్షం


కొత్త ఏడాది కురిసే అవార్డుల వర్షం

హంద్రి నీవా అవార్డు ఒక చినుకు
మాడభూషి అవార్డు ఇంకో చినుకు
ఈ ఏడాది ఇంకా చినుకులు కురిసి
ఆనందం మీకు వెల్లి విరియాలి
అభినందనలు



Wednesday, 13 January 2016

కొత్త ఏడాది ఒక్క అవార్డు తో

కొత్త ఏడాది ఒక్క అవార్డు తో 

అజో విబొ అవార్డ్ అందుకుంటూ 






Thursday, 31 December 2015

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2016

ఖదీర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 2016



ఖదీర్ బాబు గారితో చింతపల్లి అనంత్ గారి ఇంటర్వ్యు 
ఇవీ.)
దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగు కథావరణంలో ఇంకా పుట్టని ఒక prodigal story teller కి 
అల్లా ఖర్రారు చేసిన పేరు మహమ్మద్ ఖదీర్ బాబు. 
ఇప్పుడు ఈ పేరు అసలు పరిచయమే అవసరం లేనంతగా చొచ్చుకువచ్చిన మెరుగైన, 
అపురూపమైన, మేలిమి, అరుదైన సంతకం. 
ఖదీర్ మా తరం తీర్చి దిద్దిన అందమైన, అర్థవంతమైన నిలువెత్తు సంతకం.
 ఇవాళ ఖదీర్ కు సన్మానం మా తరానికి సన్మానం. నా కన్నతల్లి కర్నూలులో,
నేను కన్న తొలి గంగాప్రవాహం హంద్రీ పేరిట ఖదీర్ కథలను ఇల్లా సన్మానించుకోవడం 
నాకు ప్రత్యేకించి సంతోషం. గర్వం. 
పరిచయ వాక్యాల పరిధిలో, పరిమితిలో ఖదీర్ కతా ప్రయాణం చెప్పేందుకు 
పూనుకోవడమే దుస్సాహసం.
1994 లో పుష్పగుచ్చం కథతో మొదలై నిన్నటి మెట్రోకథల దాకా ఖదీర్ రచనాయానం
, వ్యాసంగం చాలా dynamic, rapid, and indefatigable గా సాగుతూ వుంది.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తనకు తాను ఒక కతా రచయితగా ఒక benchmark, target పెట్టుకున్నాడట.
గజమెత్తు పుస్తకాల రచన చేయడమే శ్రీపాద సంకల్పం. ఇక తక్కినదంతా మనకు తెలిసిన చరిత్ర.
గజమెత్తు పుస్తకాల సంకల్పం ఖదీర్ కు వుందో లేదో నాకు తెలియదు కానీ వాడి ‘రఫ్తార్’ చూస్తుంటే 
అది అలవోకగా చేయగల వాడి, వాశి పుష్కలంగా వున్న పెన్ను ఖదీర్ ది.
ఈ 20 ఏళ్ల లో ఖదీర్ publish చేసిన కథలూ, సంకలనాలూ దేనికవే విడివిడిగా 
గజమెత్తులో నిలిచి వీడిని ప్రతిసారీ గజారోహణం చేయిస్తూనే వున్నాయి. 
ఖదీర్ సృజన ప్రయాణం గురించి మాట్లాడటం అంటే నా మటుకు నాకు
 రెండు దశాబ్దాల మా చెక్కు చెదరని దోస్తానా గురించి పలవరించడమే.
 బహుజన వుద్యమాల కాలంలో మహోజ్వలంగా రగిలి, 
ఎదిగిన నిప్పు కణికల్లాంటి ఓ తరం సాహచర్యం పల్లవించడమే ఖదీర్ కతా ప్రస్థానం 
గురించి ప్రస్తావించడం అంటే. 
ఖదీర్ కతా సంవిధానం, కథనా నిర్వహణా Alfred Hitchcock వంటి మహా మహుల
 tight screenplay ని పోలి వుంటుంది. అల్లాంటి screenplay లో
 ఏ పేక కదిపినా కుప్ప కూలి పోతుంది విధానం. ఒక సీన్ ని తీసి వేసినా లేదా 
మనం ఆదమరిచి miss అయినా cinema లోని ఆత్మ మనకు అర్థం అవ్వాల్సిన
 మోతాదుల్లో , చేరాల్సిన రూపం లో అర్థం కాకుండా, చేరకుండా పోతుంది.
 పైగా అలా miss అయిన కొన్ని సార్లు ఆ సృజనకారుడి ఉద్దేశానికి పూర్తి 
భిన్నమైన అర్థం స్ఫురించేలా వుంటుంది. 
ఖదీర్ కథల్లో ఈ tight screenplay గుణం నిండుగా వుంటుంది. 
దీన్ని వీడు తర్ఫీదు చేసి మరీ సాధించాడు క్రమంగా.
ఖదీర్ కథల్లో నాజూకుగా, క్లుప్తంగా, గంభీరంగా, ఆర్ద్ర్హంగా, సూటిగా,
 అర్థవంతంగా అల్లుకుంటూ పోయిన, పెనవేసుకునిపోయిన 
నిర్మాణం ప్రత్యేక లక్షణంగా తళుక్కు మంటుంది. ఒకే ఒక్క వాక్యం...
 లేదా పదం తీసివేసినా మనకు అందవలిసిన తత్వం, మర్మం చేజారిపోతుంది. 
ఒకే ఒక్క పదమే ఒక ధిటవు వాక్యం లా నిలబెట్టే ఖదీర్ వాక్య నిర్మాణం లో
 తీసివేతలకు అస్సలు స్కోప్ వుండదు. నిజానికి ఒకే ఒక్క పదం రాసి దానిపక్క
 ధీమాగా full stop పెట్టాలంటే ఆ రచయితలు పోటుగాళ్ళయి వుండాలి.
 ఈ స్థాయి brevity ఖదీర్ వాక్యాలను నడుపుతున్న దివిటీ. 
ఈ స్థాయి క్లుప్తత ను సాధించడమే బహుశా గొప్ప కథకుల తర్ఫీదులోని కీలక లక్షణం.
 ఇదే ఏ రచయిత వివేకానికీ, పరిణతికీ అయినా సూచిక. నైపుణ్యానికి పరాకాష్ట. 
ఇది ఈ 20 ఏళ్లలో ఖదీర్ తన కథనా వ్యాసంగం నుంచి రాబట్టుకున్నాడు. 
అందుకే ఖదీర్ కథలు రాయడు. కథలు చెప్తాడు. రాయడం శ్రమ, నైపుణ్యాలను సూచిస్తే... 
కథ చెప్పడం అనేది శుద్ధ కళకు సూచిక.
కే‌వి మహాదేవన్ కు సంపాదకీయం ఇచ్చినా అద్భుతమైన పాట కట్టే వాడట. శుద్ధ కళకు సూచిక అదే.
O Henry, hotel లోని menu card చూసీ కథ అల్లేయగలను అని ధీమాగా ప్రకటించాడట. 
ఆ అల్లికయే కళ.
ఆ ధీమా, ఆ ease ఉన్నత సృజనకు ఊతం, ఆయువుపట్టూ. 
ఖదీర్ కథలు గమనిస్తే (కేవలం చదివితే అని కాదు నా వక్కాణింపు)
 గాలిలో చేతులు జొనిపి కతా పావురాలను సృష్టించి చకితులను చేయగల
 ఐంద్రజాలికుడిగా కథీరుడు గోచరమవుతాడు.
ఖదీర్ బాబు కు సన్మానం కథకు సన్మానం.
ఇది కావలి సాయబు గల్లీల లో గుంజాటనలో ఇంకా మగ్గుతున్న 
ఆ బడుగు జనాలకు సాదర సన్మానం.

Thursday, 24 December 2015

ఖదీర్ బాబు గారికి అజో విభో అవార్డ్

ఖదీర్ బాబు గారికి అజో విభో అవార్డ్ . 
ఇది జనవరి 2016 న ఇస్తారు . 
ఆ సందర్భంగా ఇంటర్వ్యు 

chintapalli ananth interview link




Monday, 14 September 2015

ఖదీర్ గారు అందుకున్న విశ్వనాధ్ అవార్డ్

సెప్టంబర్  లో రెండు  విశేషాలు 
ఛాయ వారి ''కధకునితో సాయంత్రం '' 
ఖదీర్ గారు అందుకున్న విశ్వనాధ్ అవార్డ్ 
మరి ఏది కధకునికి ఎక్కువ సంతోషం 
చదవరుల తో పంచుకున్న జ్ఞాపకాలా 
కష్టానికి లభించిన అవార్డు లా 
ఏమో రచయిత చెప్పాల్సిందే !


సారంగ వెబ్ మాగజైన్ లో విశేషాలు 
      ముస్లిం జీవితంపై 
  నవల రాయాలని వుంది: ఖదీర్
khadeer1


కృష్ణ మోహన్ బాబు 

సెప్టెంబర్  6 , ఆదివారం సాయంత్రం జరిగిన’ ఛాయా’ సంస్థ 
నాలుగో సమావేశం విశేషాలు ఇవీ. 
“పరిచయం అక్కరలేని కథకుడు, ప్రతీ వారం మెట్రో కథలతో 
మనకి కనిపిస్తున్న కథకుడు, ప్రత్యక్షంగా తన కథని మనకి 
వినిపించడానికి వచ్చిన కథకుడు, మహమ్మద్ ఖదీర్ బాబుని 
తన కథ వినిపించాడానికి వేదిక మీదికి పిలుస్తున్నాం”
అన్న అనిల్ బత్తుల పిలిపుతో ఖదీర్ మైక్ అందుకున్నాడు.
“ గత 20 యేళ్లలో నేను యెప్పుడూ వేదికల మీద మాట్లాడలేదు. 
ఈ సంస్థ సభ్యులు మిత్రులు, సన్నిహితులు కావడంతో, 
పరోక్షంగా నేనూ ఈ సంస్థలో భాగమేగా అనుకోవడం చేత
 ‘పెన్సిల్ బాక్స్’ అనే నా కొత్త కథని వినిపిద్దామనుకొన్నా.  
వూహించని కారణాల వల్ల ఆ కథ మెరుగులు దిద్దడం పూర్తి కాలేదు.  
అందుకనే కథకుడుగా నా ప్రయాణాన్ని మీకు చెప్పదలుచుకున్నాను.
  ‘పెన్సిల్ బాక్స్’ కథ యెప్పుడు పూర్తి అయితే అప్పుడు 
“ఛాయా” కే ఇస్తాను.  
వాళ్ళు దాన్ని యెలాగైనా వాడుకోవచ్చు”
 అంటూ ఖదీర్ తన కథ చెప్పడం మొదలు  పెట్టాడు.
“నా చిన్నప్పుడు యెప్పుడూ నేను యేదో కోల్పోయినట్లుండే వాడిని.  
మా నాన్న ఎలెక్ట్రీషియన్. 7 వ తరగతి దాకా చదువుకున్నాడు.  
యెంతో ఒద్దికైన పనిమంతుడు.  నాన్నకి కోపం చాలా యెక్కువ.  
అందుకే అమ్మ యెప్పుడూ యేదో తెలియని కంగారులో  వుండేది.  
నాకు ఇంట్లో వుండాలనిపించేది కాదు.  
మా చుట్టుపక్కల వున్న వైశ్యుల  ఇళ్ళకి వెళ్ళి, 
“చందమామ” లో  కథలు చదువుతూ వుండేవాడిని. 
 నాకూ అలా కథలు రాయాలనిపించేది.  
10 వ తరగతిలో  వుండగా ఆంజనేయ నాయుడుగారు 
అనే మాస్టారు వీరపల్లె వీణా వాణి పేరుతో రచనలు చేస్తూవుండేవారు.  
రాయాలంటే కలం పేరు వుండాలని చెప్పి, 
నాకు ‘అగ్ని మిత్ర’ అనే మారు పేరు తగిలించారు. 
 ఆ పేరు మీద రాసిన ఒక కథ పత్రికలో  అచ్చు అయి 
150 రూపాయల పారితోషికం కూడా కలం పేరు మీదే వచ్చింది.
ఆ తర్వాత యెన్ని కథలు పంపినా తిరుగుటపాలో వచ్చేవి .  
కథలు పంపడానికి స్టాంపులకి కూడా డబ్బు లేకపోతే, 
వాళ్ళనీ వీళ్ళనీ మెప్పించి తీసుకొనేవాడిని.  
పత్రికలలో పనిచేస్తేనే కథలు పడతాయని గట్టిగా నమ్మి, 
డిగ్రీ అయిన వెంటనే ‘ఈనాడు’ లో  జేరా.  
అలాయినా ‘ఈనాడు’ ఆదివారం అనుబంధంలో 
ఒక్క కథైనా అచ్చుకాలే.  అది వదిలేసి 
‘ఆంధ్ర జ్యోతి’ తిరుపతి యెడిషన్ లో  జేరా. 
 నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, జి. ఆర్. మహర్షి, 
మేర్లపాక మురళి, యిలా సీనియర్ రచయితలు 
అందరూ అక్కడ వుండేవారు.  

‘పుష్ప గుచ్ఛం’ పేరుతో ఒక కథ అచ్చైనది కాని, 
అంతకు మించి బండి ముందుకు వెళ్లలేదు.  
ఏదో సాహిత్య వ్యాసంలో నా పేరు కూడా వుందని 
సీనియర్లు ఏడిపించారు కూడా.  కానీ ఏదో రోజు నా రచనల 
మీద చర్చ వుంటుందని ఆ రోజు గట్టిగా అనుకున్నాను.
  నేను హైదరాబాద్ కు బదిలీ అయి వచ్చా.  
అప్పుడే నాన్న పోయాడు.  నాన్న కష్టపడి కూడా బెట్టిన
 25,000/- అమ్మ పక్షవాతం కోసం ఖర్చై పోయింది.  
అయిన అమ్మకి పూర్తిగా నయం కాలేదు. 
 పిల్లలు ఇంకా చేతికంది రాలేదు, 
రాబోయే  రోజులెలాగో అనే బెంగ తో, దిగులు తో పోయాడు.
khadeer bookనాన్న చావు నా మీద చాలా ప్రభావం 
చూపించింది.  నేను చెప్పవలసిందేమిటో, 
రాయవలసినదేమిటో  స్పష్టంగా తెల్సింది.  

నే పెరుగుతూ చూసిన పేద ముస్లిం కుటుంబాల గురించే చెప్పాలని 
తీర్మానించుకున్నాను. 
 అప్పుడు రాసిన కథలే ‘దావతు, జమీను.’  
ఆ సమయంలోనే  నామిని ‘ఆంధ్ర జ్యోతి’ హైదరాబాద్ కు వచ్చాడు. 
  ‘దర్గా మిట్ట ‘ కథలు రాస్తావా అని అడిగాడు.
  రాస్తాను అని చెప్పా.  ఏమి రాస్తావు అని ఆయన అడగలేదు, 
ఎలా రాస్తానూ అని నే చెప్పలేదు. 
 నా మీద నమ్మకంతో ప్రకటన యిచ్చేశాడు. 
 వారం వారం రాయాలి.  రాశాను. 
ఆ తర్వాత తిరిగి చూసుకున్నది లేదు. 
 హైదరాబాద్ లో ‘ అనంతు’ లాంటి మిత్రుల 
నుంచి చాలా నేర్చుకున్నాను.
కథా వస్తువు విషయం లో  కూడా నా లో చాలా మార్పులు
 వచ్చాయి.  నేను దగ్గర నుంచి చూస్తున్న 
ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలు, 
సిటీ బతుకులు నా ‘బియాండ్ కాఫి, మెట్రో కథలకి’ ఆలంబన 
అయ్యాయి.  ఇన్నేళ్లు పత్రికలలో పనిచేసిన అనుభవం 
నా రచనలకి బ్రీవిటీ నిచ్చింది.  
అందుకనే ‘మెట్రో కథలలో’ పాత్రలకి పేర్లు వుండవు.  
అతడు, ఆమె అని కూడా వుండవు.  
అయినా పాఠకులు కనెక్ట్ అవుతున్నారు. 
 ‘సెల్ఫీ, షి’ లాంటి కథలు ఎలాంటి చర్చను రేకెత్తిస్తున్నాయో
 మీకు తెల్సు. కథ రాయడానికి క్రాఫ్ట్ చాలా అవసరం.  
వుదాహరణకి’ ఆవిడ పిల్లలకి బ్రెడ్ మీద జామ్ రాసింది’ 
అనటం కన్నా’ న్యూటెల్లా రాసింది’ అంటే పాఠకుడు వెంటనే 
కనెక్ట్ అవుతాడు.  అదే క్రాఫ్ట్.   

అయితే ‘దర్గా మిట్ట’ కథలు మళ్ళీ ఇప్పుడు 
రాయమంటే రాయలేను. నాన్నకి హిందీ పాటలన్నా,
 సినిమాలన్నా చాలా ఇష్టం.  వాటి గురించి మాకు
 ఎప్పుడూ చెప్తూవుండేవాడు.  ఆ బాగ్రౌండ్ నుంచి వచ్చినవే
 ‘మన్ చాహే గీత్, బాలీవుడ్ క్లాస్సిక్స్ .’ 
 నాకు ఒక నవల రాయాలని వుంది ముస్లిం జీవితాలను గురించి. 
 రాస్తాను” అంటూ ముగించాడు.
ఆ తర్వాత ఖదీర్ తనకు బాగా నచ్చిన కథ,
 ‘ వహీద్,’ మరో చిన్న కథ చదివి, కొందరు 
అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పి,  తన కథ ముగించాడు.

Tuesday, 25 August 2015

Monday, 27 July 2015

కొన్ని జ్ఞాపకాలు మరో సారి


కొన్ని జ్ఞాపకాలు
జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి
ఎక్కే మెట్ల మీద అలసట తీరడానికి
కాసింత ఆత్మ విశ్వాసం మన వెన్ను నిమరడానికి
 చేసిన తప్పు ఒప్పులు బేరీజు వేసుకోవడానికి
మనీషితనానికి ఇంకెంత దూరమో లెక్కించు కోవడానికి
అహం తో తూలామా పాతాళాని కే
బాధ్యత తో నిలిచామా శిఖరాగ్రాలకే
ఏదో ఒక మెట్టు మీద ఆగాల్సిందే
జ్ఞాపకాలలో అలుపు తీర్చుకోవాల్సిందే .......

జ్యోతి గారి అభిప్రాయం ''బియాండ్  కాఫీ మీద ''
ఇంకా సాక్షి ఫామిలీ లో ''మెట్రో కధలు '' ప్రతి ఆదివారం చదవండి 
(బహుశా మెట్రో కధలు పుస్తకం వస్తుంది . అందుకే ఇక్కడ అవి ఇవ్వడం లేదు )

. తీరుబాడికి స్త్రీత్వమ్ తోడైతే ఆ శాపం రెట్తింపై ఆది ఆ పాత్రనే కాకుండా ఇతరులను కూడా ఎలా పీడిస్తుందో ఖదీర్ బాబు పసికట్టాడు" అని ఈ పుస్తకం ముందుమాటలో రాస్తారు ఏ. గాంధీ, పీకాక్ క్లాసిక్స్ సంపాదకులు. "బియాండ్ కాఫీ" అనే కథ కాక ఇందులో మరో తొమ్మిది కథలున్నై. అన్ని కూడా ధనిక వర్గానికి చెందిన వ్యక్తుల జీవన శైలిని ప్రతిబింబిస్తాయి. "ఆస్తి" అనే కథ మనిషి జీవితపు ప్రయాణంలో రుచి చూసే ఎన్నో రకాల ఆస్తుల్ని గుర్తు చేస్తుంది. "నే మొహం ఆస్తి. ఈ ఇంటి గల్లోళ్ళు ఆ ఇంటి అబ్బాయికి ఇవ్వాల్సిన ఆస్తినీ ఇవ్వలేదు. ఇచ్చిన ఆస్తినీ వాడు నిలబెట్టుకొలేదు" అంటూ ధనిక వర్గ యువత జీవన శైలిని చెప్పిన తీరు కదిలించింది. "టాక్ టైమ్" అనే కథ నాకు తెల్సిన వ్యక్తులను మరో మారు స్పురణకు తెచ్చింది. తమ వైవాహిక జీవితం లో చక్కగా ఒదిగిపోతూ తమ ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ధనిక వర్గపు స్త్రీలు ఆచరించే విధానం కొన్ని నిజ జీవిత సంఘటనలను గుర్తుకు తెచ్చింది. నాకు బాగా నచ్చిన కథ, "ఏకాభిప్రాయం". స్త్రీని ముందు పరీక్షించి తనకు లొంగిపోతుంది అన్నప్పుడు పురుషుని ప్రవర్తన, లొంగదు అన్నప్పుడు తన నిజరూపాన్ని కప్పి పుచ్చుకుని మర్యాద అనే ముసుగు వేసుకోవడం ఈ కథ ఇతివృత్తం. నేటి ఆధునిక స్త్రీలు ఇటువంటి పురుషులను చూడకుండా ఉండరు. ఈ కథ లో పాత్రల స్వభావ చిత్రీకరణ నాకు ఈ రచయిత పుస్తకాలన్నీ చదవాలి అనే కోరిక కలిగించింది. "మచ్చ," "ఘటనా" అనే కథలలో పైకి కనపడని స్త్రీ ల ఫ్రష్టేషన్ ని రచయిత చూపించిన విధానం బావుంది." పట్టాయా... " అనే కథ వ్యభిచార కూపం లో మగ్గుతున్న యువతుల జీవితాన్ని మన ముందుకు తెస్తున్ది. ఈ కాన్సెప్ట్ తో ఎన్నో కథలు వచ్చాయి. కానీ ఈ కథ చదివిన తర్వాత కలిగిన ఫీలింగ్ చెప్పలేను. "ఆపాస్మారకం" కథలో కూడా స్త్రీ ని కామంతో చూసే మగవాని సహజ గుణం సంస్కారం అనే స్మారకం లో వచ్చినప్పుడు ఈ పురుషుడు అనుభవించే స్తితి ని రచయిత వర్ణించిన తీరు బావుంది. తల్లిగా బ్రతకాలి అని కోరుకునే ఒక సామాన్య స్త్రీ మానభంగానికి గురు అయ్యే ఘట్టం "ఇంకో వైపు" అనే కథలో వస్తుంది. ఈ కథలన్నీ మస్తిష్కాన్ని కదిలించి పారేస్తాయి. తప్పక చదవాల్సిన పుస్తకం. ఇంట్లో పర్సనల్ కాపీ గా పెట్టుకోవాల్సిన పుస్తకం. శైలిలో వాడి వేడి అన్నవి ఈ మధ్య కనిపించట్లేదు. ఆ కొరత ఈ కథల సంపుటి తీర్చింది. ఇంత పదునుగా ఉన్న శైలి ఈ మధ్య నేను చూడలేదు.


''కధా అవార్డ్ ''తీసుకున్న జ్ఞాపకం 

,,ee abbay maa hyderabad nunche'' ani adoor ku cheptunna abid hussain. pakkana hindi master writer krishna sobti. 2000 - katha award (for new bombay tailors)- new delhi



కీరవాణి గారితో 


Monday, 3 June 2013

ప్రపంచ పటం పై తెలుగు కధల ఝండా

ప్రపంచ పటం పై తెలుగు కధల ఝండా 

ఎవరి కధలకి వచ్చి   ఉంటుంది ఇంత గుర్తింపు ..... ఇంకెవరికి మన ఖదీర్ బాబు గారి కధలకే 
చదవండి ..... ఆల్ ది బెస్ట్ నాగ మనోహర్ గారు ..... ఆ కధల లోని తెలుగు వారి ఆత్మ ని 
చక్కగా ఆవిష్కరిస్తారని ఆశిస్తున్నాము . 

(link ikkada )


ఇంకా తన ఆత్మీయులు ''ఉమా మహేశ్వర రావు '' గారితో ఖదీర్ గారు .

కధా వార్షిక 2012

త్రిపుర గారికి నివాళి .... సాక్షి సాహిత్యం పేజ్ లో

(saahityapu page link ikkada )

Saturday, 27 April 2013

పుట్టిన రోజు పండగే అందరికి

పుట్టిన రోజు పండగే అందరికి 

మనిషికి ఎన్ని పండుగలు 
తొలి సారి ఊపిరి పీల్చినపుడు తల్లి నవ్వుతో ముద్దుల పండుగ 
బోసి నవ్వులు లేత పెదాలపై విరిస్తే తోబుట్టువులతో అదో పండుగ 
ఒక్కో అడుగు వామనుడిగా వేస్తె నాన్న నవ్వులతో అదో పండుగ 
పరీక్షలను జయించి తొలి జీతం తో నిలబడితేస్నేహితుల మధ్య సంతోషాల పండుగ 
ఒక తోడుని తన మనిషిగా చేర్చుకొని హృదయాన్ని పంచితే సరాగాల పండుగ 
మన రూపాన్ని చేతిలోకి తీసుకొని మీసాలు పీకించుకుంటే అదో మురిపాల పండుగ 
మానవత్వాన్ని మర్చిపోక మన పిడికిలి మెతుకుల్లో 
రెండు మెతుకులు పక్క వాడికి పెట్టిన రోజు  
దేవుడు తన ప్రతిరూపాన్నివాడిలో  చూసుకొనే నిజమైన పండుగ .....

ఏప్రిల్ 28 పుట్టిన రోజు జరుపుకొనే ఖదీర్ బాబు గారికి 
ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో అవార్డ్ లు గెలుచుకుంటూ 
అందరితో సంతోషాన్ని పంచుకుంటూ ఉండాలి అని కోరుకుంటూ 
ఈ బ్లాగ్ తరుపున శుభాకాంక్షలు 

 (సారంగ పత్రిక లో ఈ వార్త లింక్ ఇక్కడ )

నలుగురికి ‘కథా కోకిల’ అవార్డులు


ప్రసిద్ధ కథకుడు మధురాంతకం రాజారామ్ స్మృతికి నివాళిగా ఏటా ఇస్తున్న ‘కథాకోకిల’ అవార్డులు 2011 కి స.వే రమేశ్, అఫ్సర్ లకు, 2012 కి మహమ్మద్ ఖదీర్ బాబు, వి. చంద్రశేఖరరావులకు ఇస్తున్నట్టు మధురాంతకం నరేంద్ర ప్రకటించారు. ఈ అవార్డులు మే 18 న హోసూరులో జరిగే కథకుల సదస్సులో ప్రదానం చేస్తారు.
తెలుగులో కథాసాహిత్య రంగానికి సంబంధించి ఇస్తున్న అవార్డులలో మధురాంతకం పేరిట ఇస్తున్న ఈ అవార్డులకు ఒక ప్రత్యేకత వుంది. ఆయా సంవత్సరాలలో కథా రచనలో, కథాసాహిత్య విమర్శ రంగాలలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు ఇస్తూ వుంటారు. ప్రతి ఏటా ప్రచురితమయ్యే కథావార్షికలోంచి ఒక ఉత్తమ కథకి, ఆ కథా వార్షికకి సింహావలోకనం రాసే విమర్శకుడికి ఈ అవార్డు లభిస్తుంది.
గత కొన్ని సంవత్సరాలుగా కథా వార్షిక ప్రచురణ ఒక సత్సంప్రదాయంగా తెలుగు సాహిత్యంలో స్థిరపడింది. ప్రతి ఏడాది ప్రచురితమయ్యే అనేక వందల కథలు చదివి, వాటిల్లోంచి డజను కథల్ని ఎంపిక చేయడమూ, వాటి గురించి విపులమయిన సింహావలోకనం రాయించడమూ ఒక ప్రయోగంగా మధురాంతకం నరేంద్ర చేపట్టారు. ఇందులో కథలన్నీ ఒక ఎత్తు అయితే, సింహావలోకనాలు ఇంకో ఎత్తు. ఆ ఏడాది వెలువడిన కథలని గురించి ఒక అవగాహన ఏర్పరచడం లో ఈ వార్షికలు విజయవంతమవుతున్నాయి.

Monday, 22 April 2013

ఖదీర్ బాబు గారి ఖజానాలో ఇంకో అవార్డ్

టి.సుబ్బరామిరెడ్డి గారి ''TV9 Special Jury Award'' ను ఓనమాలు సంభాషణ రచనకు గాను 
''ఖదీర్ బాబు'' గారికి ప్రకటించిన సందర్భం లో 19-04-2013 న వారిని అభినందిస్తున్న సయ్యద్ నసీర్ అహ్మద్ గారు.
మీరు ఎవరైనా ఎస్.ఎం.ఎస్ చేయదలుచుకుంటే ఖదీర్ గారి ఫోన్ నంబర్ :9705444243 


ఈ రోజు సాహిత్యపు పేజ్ ''రావూరి భరద్వాజ''గారికి అంకితమై 
ఆనందపడుతూ ఉంది చూడండి 
(సాహిత్య పేజ్ లింక్ ఇక్కడ)


Tuesday, 1 January 2013

అవార్డ్ అనేది బాధ్యత

డిసంబర్ 29/2012 సాయంత్రం నెల్లూరు టౌన్ హాల్ లో 
జరిగిన కార్యక్రమం లో ''ఖదీర్ బాబు'' గారికి 
బీదా.మస్తానయ్య గారి నాన్నగారు 
''బీదా.రమణయ్య స్మారక అవార్డ్'' ను
ప్రధానం చేసారు.ఇది వారికి మంచి జ్ఞాపకం 


Saturday, 27 October 2012

మంచి చిత్రానికి సహృదయుల మన్నన ఎప్పుడూ ఉంటుంది

''నేటి దుర్వాసనభరిత చిత్రాల మద్య ''ఓనమాలు''
సుగంధబరిత చిత్రం''

''అక్కి నేని  అవార్డ్''ఓనమాలు చిత్రానికి సంభాషణ ల 
రచయితా గా పొందినందుకు ఖదీర్ బాబు గారికి 
అభినందనలు.