స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Friday 11 May 2018

కొత్త కథ 2018

కొత్త కథ 2018

అడుగు వెనుక ఒక్కో అడుగు పడుతూ ఉంటే 
ఇక అవి అడుగులు మాత్రమే కావు 
ఇక అది ఒక చరిత్ర 
దానికి పునాది మంచి కావొచ్చు చెడు కావొచ్చు 
కానీ గట్టి సంకల్పమే దానిని సృష్టిస్తుంది 
అన్ని ఇటుకులను ఒకదానిపై ఒకటి 
కదలకుండా నిలుపుకోవడం అందరికీ సాధ్యం కాదు 
దానికి మొండి ధైర్యం కావాలి 
ఖదీర్ బాబు గారి ఒక్క రైటర్స్ వర్కుషాప్ 
ఈ రోజు ఎన్నింటికి బాట వేసింది 
కథకు కూడా శాలువాలు కప్పే రోజులు వచ్చేసాయి 
ఇక ఉగాది కథాసమ్మేళనాలు జరగడమే తరువాతి అడుగు 
ఇన్ని అడుగులు వేసిన వారికి 
అది ఒక నల్లేరు మీద నడక!

ఖదీర్ గారి హిడన్  కాజల్ సృష్టించిన కొత్త కథ 2018 
ఆవిష్కరణ సంధర్బంగా అభినందనలు. 

కీసర నుంచీ సూర్యలంక మీదుగా హిడెన్ కాజిల్ దాక ...
----------------------------------
న్యూ మిలీనియం (2000): సెల్ ఫోన్లు ఎవరిదగ్గరా లేని కాలం.
చాలీచాలని వేతనాలు, దినదిన గండాలు, 
ఉద్యోగాల అభద్రతలు, అదొక సంధి యుగం.
రోజువారీ ఉద్యోగాలకూ వ్యాపకాలకూ దూరంగా 
ఎవరికీ అందుబాటులో లేకుండా కేవలం 
సాహిత్యమే సంభాషణగా రెండురోజుల పాటు 
మనసులు విప్పి గడపాలని పదిహేనుమందికి పైగా
 రచయితలు, విమర్శకులూ, పాఠకులూ 
కీసరగుట్టలో ఒక చిన్న గెస్ట్‌హౌస్‌లో కలిశారు.
రచయితలు తామెందుకు రాస్తున్నారో,
 రాయటంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలేమిటో చెప్పారు.
 కథా చిత్రణలో కొత్త వస్తువులూ, కొత్త శిల్పాలూ, 
ప్రయోగాలూ ఎలా సాధిస్తున్నారో పంచుకొన్నారు.
విమర్శక మిత్రులు అప్పుడు వస్తున్న 
కథా ధోరణుల గురించీ వాటి బలాలూ బలహీనతలూ, 
కథలెందుకు చదివిస్తున్నాయో లేకపోతున్నాయో, 
రచయితలు కొన్ని కథా వస్తువులనెందుకు 
చూడలేకపోతున్నారో, జీవితంలో ఉండే 
చిన్న ఆనందాలని ఎందుకు పట్టుకోలేక పోతున్నారో, 
సాహిత్యమంటేనే ఓ పెద్ద జీవితకాలపు బరువు 
అనిపించేంత సీరియస్‌గా (?) ఎందుకు రాస్తున్నారో,
 ప్రపంచ సాహిత్యాన్ని ఎందుకు చదవాలో, 
తెలుగులో విమర్శ ఎందుకు ఎదగటం లేదో 
అందుకు ఎమేం పరికరాలు అందుబాటులో లేవో కూడా చర్చించారు.
తెలుగు నేల మీద వివిధ ప్రాంతాల నుంచీ 
అనేక నేపధ్యాల నుంచీవచ్చిన రచయితలు 
తమ వైన ప్రత్యేక సమస్యల్నీ వాటికి సాహిత్యంలో
 చోటు కల్పించటంపై అనేక సందేహాలు వ్యక్తంచేశారు.
ఇంకా ఇలాంటివే అనేక సాహిత్య సామాజిక విశ్లేషణల సశేష ప్రశ్నలు.
వాటన్నిటినీ మించి ఆ కలయిక ఇచ్చిన మరెన్నో ఉత్తేజాలు, 
సరికొత్త స్నేహాలూ, ఆప్యాయతలూ, విజయ దరహాసాలూ.
అప్పుడు ఆ కథా సమావేశం అలా జరగటం 
వెనుక ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవల్సిన నేపధ్యముంది. 
1990ల దశకం ముగింపు ఆ సందర్భం.
తెలుగునేల ప్రపంచ పర్యావరణంతో 
కొత్త సంబంధాలకూ సంఘర్షణలకూ సిద్ధమవుతోంది. 
జీవితంలో సమాజంలో ఊహించని మార్పులు తీవ్రతరమవుతున్నాయి.

అప్పటికి తెలుగు కథపై కొత్త గొంతులు వినిపిస్తున్నాయి.
 పాత గొంతులు మూగబోతున్నాయి. మరెన్నో గొంతులు
 సుదీర్ఘ మౌనంలోకి జారిపోతున్నాయి.
 కొత్తగా రాయబోతున్నవారికీ మళ్ళీ కొత్తగా రాయదల్చుకున్న
 పాత రచయితలకీ ఎదురవుతున్నది ఒకే సమస్య. ఒకే సందేహం.
ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం రాయాలి? ఎలా రాయాలి?
అలా జరిగిన ఆ చిన్న సమావేశానికి ప్రతిఫలం మెల్లగానే 
అయినా తెలుగునేలపై అనేకచోట్ల కనిపించింది.
చిన్న చిన్న బృందాలే కాక పెద్ద పెద్ద సంఘాలు కూడా 
రచయితల్ని కలిపే ఇలాంటి సమావేశాలు అనేకం నిర్వహించాయి.
‘రైటర్స్ మీట్’ - ఇప్పటికి పన్నెండు రచయితల వర్క్ షాప్లు -
 కీసర, చినుకు, మామండూరు, నాగార్జున సాగర్, పూనే, తలకోన, చిలుమూరు,
 రామయ్య పట్నం, కొల్లేరు, సూర్యలంక, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ,
 హిడెన్ కాజిల్ - వంటి చోట్ల విజయవంతంగా నిర్వహించింది.

ఈ సమావేశాల మీద అమరేంద్ర గారి వ్యాసం ఇక్కడ:
పదిహేడేళ్ళల్లో జరిగిన ఈ పన్నెండు సమావేశాలు 
అనేక మంది సీనియర్ రచయితల సరసన 
ఒకే ఒక్క కథ రాసిన యువ రచయితలకూ కూడా చోటు కల్పించాయి.
 వారికి ప్రేరణగా నిలిచాయి.
2016 చివరిలో ‘రైటర్స్ మీట్’ వర్క్ షాప్‌కు వచ్చిన 
వారితో కథ రాయించి ప్రచురించిన కొత్త ప్రయోగం కొత్త కథ - 2017.
2017 చివరిలో ‘రైటర్స్ మీట్’ వర్క్ షాప్‌కు వచ్చిన
 వారితోరాబోతున్నది కొత్త కథ - 2018.
===========================================
రాబోయే ఆదివారం (మే 13) తెలుగు యూనివర్సిటీలో 
ఉదయం 10:30 కి కొత్త కథ - 2018 ఆవిష్కరణ
===========================================
ఈ కొత్త కథ - 2018 మీద సంపాదక బృందం ,
 ఇంకా కథలు చదివిన మిత్రుల అభిప్రాయం ఏమంటే ...
"లోపలి పేజీల్లోకి అడుగు పెట్టండి, ఇక మీ కళ్లూ మీ మనసూ ఇక మీవి కావు..."




No comments:

Post a Comment